News August 11, 2025
రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ‘మహావతార్ నరసింహ’

అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.210 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రూ.300 కోట్లను క్రాస్ చేయొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి.
Similar News
News March 9, 2026
యూట్యూబ్లోనే వీడియోలు, మెసేజ్లు పంపుకోవచ్చు!

యూట్యూబ్లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ మళ్లీ రాబోతోంది. యాప్లోనే వీడియోలు, మెసేజ్లు పంపుకునేలా వెసులుబాటు కల్పించే ఈ ఫీచర్ను 2019లో కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్తో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇతర యాప్లు అవసరం లేకుండానే యూట్యూబ్లోనే వీడియోలు, మెసేజ్లు పంపుకోవచ్చు. దీనితో పాటు షార్ట్స్ కోసం AI రీమిక్స్ ఫీచర్ కూడా రానుంది.
News March 9, 2026
భారత్ డామినేషన్.. 3 ఏళ్లలో 6 WCలు

గత 3 ఏళ్లలో భారత్ 6 క్రికెట్ వరల్డ్ కప్లు గెలిచింది. 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCతో పాటు తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. అన్ని జట్లను అభినందించారు. ఇది ఇండియన్ క్రికెట్కు గోల్డెన్ ఎరా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News March 9, 2026
మా దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరం: ఇరాన్ FM

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడంలో తాము సాయం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘మా దేశ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వం. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లీడర్ను నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. కాగా కొత్త నాయకుడిగా మొజ్తాబా ఎన్నికైనట్లు వార్తలొస్తున్నాయి.


