News March 27, 2024
హైదరాబాద్లో వర్సిటీకి మహీంద్రా రూ.500 కోట్లు!

హైదరాబాద్లో ఉన్న తమ మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదలు ఐదేళ్ల పాటు ఈ నిధుల్ని దశలవారీగా వర్సిటీకి అందించాలని తమ కుటుంబం నిర్ణయించిందని తెలిపారు. వర్సిటీ అనుబంధ పాఠశాల ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్కు మరో రూ.50 కోట్లు ఇస్తామన్నారు. మహీంద్రా గ్రూపు వర్సిటీని నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లో ఏర్పాటు చేసింది.
Similar News
News February 17, 2026
సల్మాన్ తండ్రి సలీమ్కు అస్వస్థత

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ (90) అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సహా కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు. మరో బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్తో కలిసి షోలే, దీవార్, జంజీర్, త్రిశూల్, డాన్ వంటి బ్లాక్బస్టర్లు అందించారు.
News February 17, 2026
హీరోయిన్గా ఖుష్బూ కూతురు

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక సుందర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఆరంభం’ అనే మలయాళ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. సుజేశ్ అన్నీ ఈపెన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ‘ఆరతి’ అనే పాత్రలో కనిపించనున్నారు. సుమారు 35 ఏళ్ల క్రితం ఖుష్బూ కూడా మలయాళ సినిమాతోనే కెరీర్ ప్రారంభించడం విశేషం. మలయాళం, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది.
News February 17, 2026
జనగామ.. ‘లక్కీ డ్రా’మా

TG: అనూహ్య పరిణామాల మధ్య జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఇందులో కాంగ్రెస్నే అదృష్టం వరించింది. ఆ పార్టీకి చెందిన బాలమణి ఛైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. దీంతో BRS సభ్యులు నిరసనకు దిగారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీలోనూ లక్కీ డ్రా తీయగా కాంగ్రెస్కే ఛైర్మన్(శ్రవణ్) పదవి దక్కింది.


