News April 26, 2024

పనిమనిషి ఆత్మహత్యాయత్నం: నిర్మాతపై కేసు

image

ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా, ఆయన భార్య నేహాపై కేసు నమోదైంది. ఇటీవల జ్ఞాన్‌వేల్ ఇంట్లో నగలు మాయమయ్యాయి. వాటిని పనిమనిషి లక్ష్మీ తీసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల విచారణతో మనస్తాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పనిమనిషి కుమార్తె జ్ఞాన్‌వేల్ రాజా, నేహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని చిత్రహింసలకు గురి చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News April 14, 2026

క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా?

image

అందరూ ఇష్టంగా తినే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు బిస్కెట్లను అతికించేందుకు సింథటిక్ ఎమల్సిఫయర్స్‌ను రేప్ సీడ్ ఆయిల్‌తో కలిపి క్రీమ్‌ను తయారుచేస్తారంటున్నారు. ‘వీటిని ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News April 14, 2026

3K టు 152K.. రఫేల్‌లా దూసుకెళ్లిన ప్రఫుల్ ఫాలోయింగ్

image

నిన్న RRపై తొలి ఓవర్లోనే 3 వికెట్లు, మొత్తంగా 4 వికెట్లు కూల్చిన <<19644312>>ప్రఫుల్(SRH)<<>> ఇన్‌స్టాలో రఫేల్‌లా దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన అకౌంట్‌కు కేవలం 3 వేల ఫాలోవర్లు ఉండగా గంటల్లోనే ఆ సంఖ్య 152Kకు చేరింది. ఐపీఎల్ పవర్ ఇదేనని, 4 ఓవర్ల బౌలింగ్ ఆయన లైఫ్‌నే మార్చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇలాగే ప్రదర్శన చేస్తే తిరుగుండదని పేర్కొంటున్నారు. మీరేమంటారు?

News April 14, 2026

గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు.. రేపే ప్రారంభం

image

AP: ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న అన్న క్యాంటీన్లు గ్రామాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి 62 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రేపు పల్నాడు(D) ధరణికోటలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ఓపెన్ చేసి పేదలతో భోజనం చేస్తారు. కాగా పట్టణాల్లోని 207 క్యాంటీన్లలో ప్రభుత్వం రూ.5కే ఫుడ్ అందిస్తోంది. రోజుకు సగటున 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారు.