News March 28, 2024
‘న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం’.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని 600 మంది లాయర్లు సంయుక్తంగా CJI జస్టిస్ చంద్రచూడ్కు లేఖ రాశారు. ‘ముఖ్యంగా పొలిటికల్ కేసుల్లో న్యాయవ్యవస్థపై కొందరు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పటి న్యాయవ్యవస్థ బాగుండేదని దుష్ప్రచారం చేస్తుంటే దానికి కొందరు లాయర్లు వంతపాడటం బాధాకరం. వీరిపై సుప్రీంకోర్టు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
విద్యుత్ ‘కట్‘కటా లేకుండా ఏర్పాట్లు

TG: ఎల్నినో కారణంగా ఈ ఏడాది ఎండలు తీవ్రమై రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 18000 MW వరకు పెరగొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రేటర్ HYDలోనే ఈసారి 4000 MW అవసరమని, యాసంగి(ఏప్రిల్, మే)లో సాగుకు వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా యాదాద్రి ప్లాంటులో 4000 MW ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. పీక్ అవర్లో విద్యుత్ రేట్లు భారీగా ఉన్నా కొనుగోలుకు రెడీ అవుతోంది. 2025లో 17500 MW డిమాండ్ ఉంది.
News February 16, 2026
విశ్వక్కు వరుస షాక్లు.. రూటు మార్చాల్సిందేనా?

ENE, ఫలక్నుమాదాస్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్సేన్కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చాలా కాలంగా హిట్కు దూరమైన ఆయనకు తాజాగా రిలీజైన ‘ఫంకీ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు ‘లైలా’, ‘మెకానిక్ రాకీ’ కూడా ఫెయిలయ్యాయి. దీంతో విశ్వక్ సరైన కథలను ఎంపిక చేసుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ENE2’, ‘కల్ట్’ సినిమాలైనా ఆయనకు హిట్ ఇస్తాయేమో చూడాలి.
News February 16, 2026
ఆగ్నేయ మూలలో వాస్తు దోషం ఉంటే?

ఆగ్నేయం దోషపూరితంగా ఉంటే కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కష్టపడి సంపాదించిన ధనం వృథా అయ్యే ఛాన్సుంది. రావలసిన డబ్బు సమయానికి అందదు. ఇంట్లో మహిళలు మానసిక వేదనకు, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబీకుల మధ్య ఐక్యత లోపించి, నిరంతరం చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థలాన్ని వినియోగించుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


