News March 27, 2024
ఉప్పల్లో మ్యాచ్.. మెట్రో టైమింగ్లో మార్పు

సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఈక్రమంలో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. చివరి మెట్రో రైళ్లు వాటి టెర్మినల్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపింది. నాగోల్, ఉప్పల్, స్టేడియం & NGRI స్టేషన్లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది.
Similar News
News February 18, 2026
వెంటిలేటర్పై సల్మాన్ ఖాన్ తండ్రి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.
News February 18, 2026
2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.
News February 18, 2026
2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.


