News May 1, 2024

ఈనెల గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ: IMD

image

దేశంలో ఈనెల భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని IMD హెచ్చరించింది. ‘రెండు నుంచి ఎనిమిది రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈనెల సాధారణం కంటే ఎక్కువ ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, సెంట్రల్ ఇండియా, వాయువ్య భారతం ఇందుకు మినహాయింపు. కాగా ఏప్రిల్‌లో 1901 తర్వాత ఆ స్థాయిలో దక్షిణ భారతంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు (31 డిగ్రీల సెల్సియస్) నమోదు కావడం ఇది రెండోసారి’ అని తెలిపింది.

Similar News

News December 15, 2025

మూడు దేశాల పర్యటనకు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్‌’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.

News December 15, 2025

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌-5 వీళ్లే

image

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 9 చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉండగా టాప్‌-5 ఫైనలిస్టులు ఖరారయ్యారు. తనూజ, డిమోన్‌ పవన్‌, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజన ఫైనల్‌ రేసులోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన డబుల్‌ ఎలిమినేషన్‌లో శనివారం <<18553037>>సుమన్‌శెట్టి<<>> ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆదివారం <<18559680>>భరణి<<>> ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

News December 15, 2025

ఖమ్మం జిల్లాలో TDP మద్దతుదారు విజయం

image

TG: ఖమ్మం జిల్లా కామేపల్లి మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ సొంతం చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థి అజ్మీర బుల్లి విజయం సాధించారు. బీజేపీ, BRS, జనసేన పార్టీల మద్దతుతో గెలిచినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం ఆమె భర్త హరినాయక్ సర్పంచ్‌గా గెలవగా, ఇప్పుడు బుల్లి గెలుపొందారు. కాగా మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుదారులు మూడు పంచాయతీలను సొంతం చేసుకున్నారు.