News May 14, 2024
మే 18.. అంటే తగ్గేదేలే

మే 18.. అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే. కొన్నేళ్లుగా ఆ తేదీన జరిగిన మ్యాచ్ల్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో బెంగళూరుకు ఓటమి అన్నదే లేదు. మే 18న పలు సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 56*, 27, 113, 100 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అదే తేదీన ఈ శనివారం చెన్నైతో డూ ఆర్ డై మ్యాచ్ జరగనుండటంతో కోహ్లీ చెలరేగి జట్టును ప్లే ఆఫ్స్కు చేరుస్తారంటూ అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 11, 2025
మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.
News December 11, 2025
ఈ ఉదయం 7 గంటల నుంచి..

TG: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి మ.1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2PM నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది.. 27,628 వార్డులకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 5 గ్రామాలకు, 169 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి.
News December 11, 2025
గురువారం బృహస్పతిని పూజిస్తే..

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.


