News March 30, 2024

మయాంక్ దెబ్బ.. పంజాబ్ ఓటమి

image

లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ కుదేలైంది. 200 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్(70), బెయిర్‌స్ట్రో(42) రాణించారు. అయితే మయాంక్ నిప్పులు చెరిగే బంతులతో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేశారు. ఆఖర్లో పంజాబ్ బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 178/5 రన్స్ మాత్రమే చేసింది. 21 రన్స్ తేడాతో ఓడింది.

Similar News

News February 17, 2026

అధిక మాసంలో శుభ కార్యాలు ఎందుకు నిషిద్ధం?

image

అధిక మాసంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడు. అందుకే దీనిని ‘శూన్య మాసం’ అంటారు. ‘మైల మాసం’ అని కూడా పిలుస్తారు. శాస్త్రం ప్రకారం.. సూర్య గమనం లేని ఈ సమయంలో చైతన్యం తక్కువగా ఉంటుంది. ఫలితంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేస్తే విఘ్నాలు ఎదురవుతాయని నమ్ముతారు. ఆశించిన ఫలితాలు దక్కవని పండితుల అభిప్రాయం. అందుకే ఈ మాసంలో లౌకిక శుభకార్యాలు పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.

News February 17, 2026

ఈనెల 25న టీచర్ల సీనియారిటీ లిస్టులు

image

AP: టీచర్ల సీనియారిటీ జాబితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన లిస్టులు సిద్ధం చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. 25న విడుదలయ్యే తొలి విడత జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించి మార్చి 3న రెండో విడత, 15న మూడో విడత రిలీజ్ చేస్తారు. తుది జాబితాలను మార్చి 30న ప్రకటించి సీనియారిటీ ఖరారు చేస్తారు. వాటి ఆధారంగానే వేసవి సెలవుల్లో బదిలీలు జరుగుతాయి.

News February 17, 2026

‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

image

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.