News December 14, 2025
MBNR: ఈనెల 22 నుంచి “టీ-20 క్రికెట్ లీగ్”

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ఈనెల 22 నుంచి 26 వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో జి.వెంకటస్వామి కాక మెమోరియల్ ఉమ్మడి జిల్లా టీ-20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్, NGKL, NRPT, GDWL, WNPT జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందన్నారు.
Similar News
News January 19, 2026
మన్యంకొండ ఆలయ హుండీ ఆదాయం రూ.35.77 లక్షలు

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
News January 19, 2026
ఇండియన్ క్రికెట్లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
News January 19, 2026
మహబూబ్నగర్: టీచర్ల కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా

రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని డీఈఓ కార్యాలయ ఏడీ అనురాధకు టీఎస్యూటీఎఫ్ (TSUTF) నాయకులు వినతిపత్రం ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు, వేడుకల అనంతరం సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.


