News March 31, 2024

MBNR: ఒకే వేదికపై పాలమూరు ఎంపీ అభ్యర్థులు

image

మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. నేడు ఈస్టర్ పండగ సందర్భంగా ఎంబి కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ వేడుకకు పార్లమెంటరీ అభ్యర్థులు డీకే అరుణ(బీజేపీ), చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నే శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్) హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆప్యాయతను కనబరిచారు. అభ్యర్థులను చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News February 12, 2026

MBNR: రేపే కౌంటింగ్.. ఇవి నిషేధం: SP

image

పాలమూరు యూనివర్సిటీ (లెక్కింపు కేంద్రం) పరిసర ప్రాంతాల్లో BNSS 163 ప్రకారం నిషేధాజ్ఞలు (సెక్షన్ 144 అమలు) శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

News February 12, 2026

MBNR: నియమాలు ఉల్లంఘిస్తే రిమాండ్‌కే: SP

image

పాలమూరు యూనివర్సిటీ వద్ద ఓట్ల లెక్కింపుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. SHARE IT.

News February 12, 2026

MBNR: ‘తెలంగాణ తరహా కర్ణాటకలో కులవృత్తులను పునరుద్ధరించాలి’

image

తెలంగాణ రాష్ట్రంలో ఉండే కులవృత్తుల మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కులవృత్తులను పునరుద్ధరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రణవ నంద స్వామి పాదయాత్ర ప్రారంభించి 700 కిలోమీటర్లకు చేరగా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటక విధాన సభలో నారాయణ గురు స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.