News November 19, 2025

MBNR: పవిత్ర పుణ్య క్షేత్రాలకు డీలక్స్ బస్

image

మహబూబ్ నగర్ నుంచి పవిత్ర పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత ‘Way2News’తో తెలిపారు. ఈనెల ఉదయం 6:00 గంటలకు మహబూబ్ నగర్ నుంచి కొల్లాపూర్ సమీపంలోని పవిత్ర క్షేత్రాలు సోమశిల & సింగోటంకు బస్ వెళ్తుందని, తిరిగి సాయంత్రం 7:00 గంటలకు వస్తుందన్నారు. ఒక్కరికి ఛార్జీ: రూ.500. పూర్తి వివరాలకు 70136 46089, 93989 62021కు సంప్రదించాలని కోరారు.

Similar News

News January 24, 2026

నిర్మల్: డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్

image

వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు తెచ్చింది. శనివారం (జనవరి 24) నుంచి కొనుగోలు చేసే వాహనాలకు డీలర్ పాయింట్ వద్దే రిజిస్ట్రేషన్ జరుగుతుందని రవాణా శాఖ అధికారులు దుర్గాప్రసాద్, మహేందర్ తెలిపారు. వాహనదారులు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, షోరూమ్‌లోనే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందన్నారు.

News January 24, 2026

14 మందితో చెరువుగట్టు ఉత్సవ కమిటీ

image

చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు 14 మందితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెరువుగట్టు ఈఓ మోహన్ బాబు తెలిపారు. సభ్యులుగా వరాల రమేష్, రంగ శ్రవణ్, మందుల నరసింహ, కొమ్ము శ్రీసు, గౌరుదేవి లక్ష్మయ్య, రేగటి శ్రీనివాస్ రెడ్డి, నల్ల అనితతో పాటు మరో ఏడుగురు సభ్యులుగా నియమితులయ్యారు.

News January 24, 2026

నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

image

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.