News November 8, 2025

MBNR: పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక డీలక్స్ బస్సులు నడుపుతున్నట్లు MBNR డిపో మేనేజర్ బి.సుజాత Way2Newsతో తెలిపారు. ఈ నెల 15న ఉ.6:00 గంటలకు MBNR బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయని, 1.వేములవాడ – ధర్మపురి, 2.మంత్రాలయము – జోగులాంబ దేవాలయము మొదలగు పుణ్యక్షేత్రాలకు వెళ్లానున్నట్లు తెలిపారు. వివరాలకు 94411 62588, 73828 27102 సప్రదించాలన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలాన్నారు.

Similar News

News January 17, 2026

ఆదిత్యుని సేవలో.. శ్రీకాకుళం కలెక్టర్

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ప్రసాద్ ఆయనకు తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

News January 17, 2026

VKB: చీకట్లో వైద్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో అవస్థలు

image

వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్లూకోజ్, డెలివరీ గదుల్లో లైట్లు లేకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. శనివారం కామునిపల్లి నుంచి వచ్చిన ప్రసవ కేసు విషయంలో లైట్లు లేక గర్భిణి పడ్డ అవస్థలు వర్ణనాతీతం. అత్యవసర సమయంలోనూ వెలుతురు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News January 17, 2026

ఉద్యమ పార్టీగా ఎన్నో ఒడిదుడుకులు చూశాం: కొప్పుల

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ధర్మపురిలో మాట్లాడుతూ.. అధికార పార్టీకి ధన బలం, అధికార బలం ఉంటే.. BRSకు ప్రజాబలం ఉందన్నారు. పార్టీ మారినవారి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక ఉద్యమ పార్టీగా ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూశామని వ్యాఖ్యానించారు. KCR హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.