News September 11, 2025
MBNR: భారీ వర్షాలు.. SP కీలక ఆదేశాలు

వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు వచ్చే మూడు రోజులు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా ఉన్నందున గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News December 15, 2025
మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

@మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
@మిడ్జిల్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ. డి.జానకి ఎన్నికల పోలింగ్ను పరిశీలించారు.
@కౌకుంట్ల మండలంలో 12 గ్రామపంచాయతీలకు గాను.. 10 గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
@దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పావని 110 ఓట్లతో గెలుపొందింది.
@ మిడ్జిల్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
News December 14, 2025
సీసీ కుంట నూతన సర్పంచులు వీరే !

అల్లిపూర్ శారదమ్మ
అమ్మాపూర్ – రంజిత్ కుమార్
బండార్ పల్లి – బత్తుల సుజాత
వడ్డేమాన్ – స్వప్న
సీసీ కుంట మానస – దమాగ్నాపూర్ పావని
ఏదులాపూర్ – ఆంజనేయులు
ఫర్దిపూర్ – శివకుమార్
గోప్య నాయక్ తండా – రాములు
గూడూరు – భీమన్న
లాల్ కోట – గోపాల్
మద్దూరు – దామోదర్
నెల్లికొండి – సుకన్య
పల్లమర్రి – లక్ష్మీ
సీతారాంపేట – హుస్సేన్ జీ
ఉంద్యాల -ఆంజనేయులు.
News December 14, 2025
MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

మిడ్జిల్ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మసి గుండ్లపల్లి సర్పంచ్గా శ్రీశైలం యాదవ్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మీద చెన్నయ్య 16ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. సందర్భంగా గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.


