News March 25, 2024
MBNR: ‘మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం’

మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5,6,7వ తరగతుల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని భగీరథ కాలనీలోని గురుకుల పాఠశాల-3 ప్రిన్సిపల్ కె.సురేఖ తెలిపారు. నాల్గో తరగతి చదువుతున్న దరఖాస్తు చేసుకోవాలని, 80 సీట్లలో 60 ముస్లింలకు, 20 రిజర్వేషన్ ప్రాతిపాదికన భర్తీ చేశామన్నారు. 6, 7వ తరగతుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు.
Similar News
News December 14, 2025
MBNR: ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్

మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
News December 14, 2025
MBNR: 11 గంటల వరకు 55 శాతం పోలింగ్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 14, 2025
MBNR: రెండో విడత ఎన్నికలు.. గెట్ రెడీ!

MBNR జిల్లాలోని హన్వాడ(35 GP), సీసీకుంట(18), దేవరకద్ర(18), కోయిలకొండ(44), కౌకుంట్ల(12), మిడ్జిల్(24) మండలాల్లోని 151 GPలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 151 సర్పంచ్ పదవులకు, 1,334 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.


