News November 19, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్కు పంపిస్తామన్నారు.
Similar News
News January 22, 2026
SKLM: KR స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో భాగంగా, శ్రీకాకుళం నగరంలోని కె.ఆర్. స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. KR స్టేడియం వద్ద వాహనాలు పార్కింగ్ విషయంలో ఎంట్రీలు, ఎగ్జిట్ అత్యవసర సమయాల్లో ప్రత్యేక మార్గాలు వినియోగంపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. DSP వివేకానంద, RDO కృష్ణమూర్తి ఉన్నారు.
News January 22, 2026
పాడేరు: ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

RBSK ప్రోగ్రామ్-DEICలో భాగంగా పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్నవారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైందని జరిగిందని డీఎంహెచ్వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ గురువారం తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 23వ తేదీలోగా తెలపాలని సూచించారు. మరిన్ని వివరాలకు allurisitharamaraju.ap.gov.in వెబ్సైట్ని సంప్రదించాలన్నారు.
News January 22, 2026
హుజూర్నగర్: విద్యార్థులే అంబాసిడర్లు: ఎస్పీ నరసింహ

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని గ్రీన్వుడ్ పాఠశాలలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు రోడ్డు భద్రత అంబాసిడర్లుగా మారి తల్లిదండ్రులు, ప్రజల్లో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.


