News April 23, 2025
MDCL: ITI సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ITI సప్లమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మెకానికల్ డీజిల్ సహా ఇతర ట్రేడ్లకు సంబంధించిన విద్యార్థులు ‘ట్రేడ్ తీయరి’ సబ్జెక్టు పరీక్ష రాయగా, మంగళవారం ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఇన్నో విజన్ టెక్నాలజీస్లో CBT పరీక్ష పూర్తైంది. మిగతా అన్ని బ్రాంచీలకు పరీక్ష పూర్తైన తర్వాత ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు.
Similar News
News March 10, 2026
విజయనగరం కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. నగరపాలక సంస్థలో తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారు. నగరంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, కీలక నిర్ణయాల బాధ్యత ఇకపై కలెక్టర్ నేతృత్వంలోనే కొనసాగనుంది.
News March 10, 2026
విశాఖలో సరికొత్త పర్యాటక హంగులు

విశాఖలో అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు VMRDA కీలక అడుగు వేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో అత్యాధునిక ‘రోప్వే’ & ‘లూజ్ గ్రావిటీ రైడ్’ అభివృద్ధికి టెండర్లు (RFP) ఆహ్వానించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే ఈ ప్రాజెక్టు విశాఖ పర్యాటక రంగానికి మరింత ఊపునివ్వనుంది. దీని ద్వారా విదేశీ తరహా వినోద క్రీడలు ఇకపై మన నగరంలోనే అందుబాటులోకి రానున్నాయి.
News March 10, 2026
FDI రూల్స్ సడలించిన కేంద్రం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2020లో తెచ్చిన రూల్స్ను సవరించినట్లు తెలుస్తోంది. పాత రూల్లో చైనా సహా భారత్తో సరిహద్దు పంచుకున్న దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే కేంద్రం అనుమతి ఉండాల్సిందే. ఇతర విదేశీ సంస్థలైనా సరే వాటిలో ఈ దేశాల వాటా ఉంటే ఈ రూల్ వర్తిస్తుంది. చైనాతో ఉద్రిక్తతలు, దేశ భద్రత దృష్ట్యా గతంలో ఈ నిబంధన తెచ్చింది. తాజాగా ఈ నిబంధన మార్చింది.


