News August 15, 2025
MDK: ‘అత్యవసర సేవలకు అందుబాటులో ఉండాలి’

అత్యవసర సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం పెద్దశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు, ల్యాబ్, ఫార్మసీలను తనిఖీ చేసి, లేబర్ రూంను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల కారణంగా గర్భిణులను ఈడీడీకి పది రోజుల ముందు సమీప ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు.
Similar News
News March 13, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.12 % హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4,801 మందికి గాను 4,711 మంది, ఒకేషనల్ విభాగంలో 267 మందికి గాను 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 98.12 శాతం హాజరు నమోదైందని అధికారి మాధవి తెలిపారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు పూర్తయ్యాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.
News March 13, 2026
మెదక్: ఇంటర్ విద్యార్థులకు యాక్సిడెంట్

టేక్మాల్ మండలం కద్దులూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పులర్ నుంచి అల్లాదుర్గ్ పరీక్షా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని 108 సిబ్బంది మహేష్ కుమార్, దుర్గయ్య ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ప్రమాదానికి గురవ్వడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 13, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.


