News April 27, 2024
MDK: ‘నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం’

ఎన్నికల్లో పైచేయి సాధించాలని ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అవతలి పార్టీ మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా చేరికలను నాయకులు ప్రోత్సహిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానికంగా పెద్ద నేతలను చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు ఇతర నాయకులు వస్తారని చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
Similar News
News April 16, 2026
కొల్చారం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.
News April 16, 2026
కొల్చారం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.
News April 16, 2026
మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


