News November 19, 2025

MDK: లక్షల్లో జీతం.. లంచాలే నేస్తం!

image

లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఉమ్మడి జిల్లాలో కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా అవినీతిని అరికట్టాల్సిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఈనెలలో ములుగు ఎస్ఐ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం మర్చిపోకముందే మంగళవారం టేక్మాల్ ఎస్ఐ పట్టుబడ్డారు.

Similar News

News January 18, 2026

పొంగులేటి నివాసంలో సీఎం విందు.. అదిరిందన్న రేవంత్!

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా మంత్రి ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలతో కూడిన విందును సీఎం ఆస్వాదించారు. “భోజనం అదిరింది” అంటూ మంత్రి కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం పొంగులేటి దంపతులు సీఎంను శాలువాతో సత్కరించి, హస్తకళా పెయింటింగ్‌ను జ్ఞాపికగా బహూకరించారు.

News January 18, 2026

హీరో ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ టీమ్ రియాక్షన్ ఇదే

image

వచ్చే నెల 14న తమిళ హీరో ధనుష్‌తో <<18863331>>పెళ్లి<<>> అంటూ జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టీమ్ తెరదించింది. ‘మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవట్లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొంది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దని సూచించింది. కాగా ఇప్పటివరకు మృణాల్ గానీ ధనుష్ గానీ ఈ ప్రచారంపై స్పందించకపోవడం గమనార్హం.

News January 18, 2026

రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స

image

AP: రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏ వర్గానికీ సంక్రాంతి సంతోషం లేదన్నారు. పండగ ముందే మద్యం ధరలు, భూముల విలువలు పెరిగాయని విమర్శించారు. ‘పంటలకు గిట్టుబాటు ధర లేదు. యూరియా ఇప్పటికీ అధిక ధరకే అమ్ముతున్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కింది. గ్రామ బహిష్కరణలు, శాంతిభద్రతల లోపాలపై ప్రధాని మోదీ స్పందించాలి’ అని కోరారు.