News November 19, 2025
MDK: లక్షల్లో జీతం.. లంచాలే నేస్తం!

లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఉమ్మడి జిల్లాలో కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా అవినీతిని అరికట్టాల్సిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఈనెలలో ములుగు ఎస్ఐ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం మర్చిపోకముందే మంగళవారం టేక్మాల్ ఎస్ఐ పట్టుబడ్డారు.
Similar News
News January 18, 2026
కారణజన్ముడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

AP: NTR కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అని CM CBN అన్నారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘సిని వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ NTR తరతరాల చరిత్రను తిరగరాశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. రూ.2కే కిలో బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు తదితర పథకాలతో చరిత్ర గతిని మార్చారు’’ అని కొనియాడారు.
News January 18, 2026
మందమర్రి మున్సిపల్ .. వివాదాల కొర్రి!

జిల్లాలో 30 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా అవతరించిన మందమర్రి వివాదాల కారణంగా ఎన్నికలకు నోచుకోవడం లేదు. ఈసారి కూడా ఎన్నికలు జరగటం లేదు. 30ఏళ్ల క్రితం 1/70 చట్ట పరిధిలో ఉన్న మందమర్రిని మున్సిపాలిటీ చేసి ఎన్నికలకు రిజర్వేషన్లు సైతం ప్రకటించారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ SC రిజర్వు కావడంతో ST వర్గానికి చెందిన పెద్దలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 3దశాబ్దాలుగా పాలకులు లేకుండా కొనసాగుతోంది.
News January 18, 2026
VKB: మద్యం అక్రమంగా అమ్మితే 25 చెప్పు దెబ్బలు, రూ.5లక్షల ఫైన్

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మదన్పల్లిలో గ్రామస్థులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. బెల్ట్ షాపులను ఎవరూ నిర్వహించొద్దని తీర్మానం చేశారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని అమ్మితే 25 చెప్పు దెబ్బలు, రూ.5 లక్షల జరిమానా విధిస్తామని ముక్తకఠంతో తేల్చిచెప్పారు. గ్రామంలో ఉన్న అన్ని షాపుల యజమానులకు దీనిపై అవగాహన కల్పిస్తూ తీర్మాన పత్రాన్ని పదర్శించారు.


