News May 13, 2024
MDK: సమయం లేదు మిత్రమా.. తరలివెళ్లండి

ఉమ్మడి జిల్లాలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగియనుంది. 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి ఓటు వేసి అవకాశం కల్పిస్తారు. కావున ఇప్పటివరకు ఓటు వేయని వారు ఓటర్లు త్వరగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పదండి ఇంకా ఓటేసి మీ నాయకుడిని ఎన్నుకోండి.
Similar News
News December 14, 2025
మెదక్: 2వ విడత 88.80% పోలింగ్

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లో 88.80% పోలింగ్ నమోదైంది.
చేగుంట 87.86%, మనోహరాబాద్ 90.35%, మెదక్ 91.64 %, నార్సింగి 89.01%, నిజాంపేట్ 85.27%, రామాయంపేట్ 88.42%, శంకరంపేట్ (ఆర్) 89.68%, తూప్రాన్ 87.98 % పోలింగ్ నమోదైంది. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షించారు.
News December 14, 2025
FLASH: MDK: 6 ఓట్లతో WIN

చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామ సర్పంచ్గా శంకర్ సబిత గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి శ్వేతపై 6 ఓట్ల తేడాతో అమె విజయం సాధించారు. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి సబిత విజయం సాధించారు. మండలంలో వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తొలి ఫలితం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమౌతుంది.
News December 14, 2025
మెదక్: మధ్యాహ్నం ఒంటిగంట వరకు 85% పోలింగ్

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు 85% నమోదైంది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు స్వగ్రామం కొర్విపల్లి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కోనాపూర్లో ఓటేశారు. పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు సందర్శించారు.


