News March 31, 2024

MDK: BRS, కాంగ్రెస్‌ని నమ్మకండి: రఘునందన్‌రావు

image

BRS, కాంగ్రెస్‌ని ప్రజలు నమ్మొద్దని, వాటికి ఓటేసి మోసపోవద్దని BJP మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. BRS, కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News February 18, 2026

పీఆర్సీపై సీఎం తక్షణమే ప్రకటించాలి: ఎస్టీయూ

image

నూతన పీఆర్సీపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని పేర్కొన్నారు.

News February 18, 2026

ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

image

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.

News February 17, 2026

శోభాయమానంగా ఏడుపాయల రథోత్సవం

image

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రథాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఊరేగింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి కీర్తి ఎల్లలు దాటిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.