News November 7, 2025

MGBS నుంచి పంచ శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా పంచశైవక్షేత్రాల దర్శనానికి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC అధికారులు వెల్లడించారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, సామర్లకోట భీమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించేలా బస్సు సేవలు తీసుకొచ్చారు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు MGBS నుంచి బస్సు బయలుదేరుతంది. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
SHARE IT

Similar News

News January 23, 2026

MBBS సీటు కోసం కాలును నరుక్కున్నాడు

image

దివ్యాంగుల కోటాలో మెడికల్ సీటు పొందేందుకు ఓ వ్యక్తి తన కాలును తానే నరుక్కున్నాడు. UPలోని జౌన్‌పూర్‌(D)కు చెందిన సూరజ్‌ భాస్కర్‌ (20) NEET పరీక్షలో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. దివ్యాంగుల కోటాలో అయితే ఈజీగా సీటు వస్తుందని భావించి కాలును నరుక్కుని దాడిలో కోల్పోయానంటూ నాటకమాడాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు న్యాయ సలహా కోరారు.

News January 23, 2026

ప్రతి ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి: విశాఖ కలెక్టర్

image

ఈనెల 4వ శనివారం (జనవరి 24) జిల్లావ్యాప్తంగా ‘జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర (SASA)లో భాగంగా ఉదయం 6 గంటల నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. 86 విభాగాలు సమన్వయంతో పాల్గొని వివరాలను సాసా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.

News January 23, 2026

అక్రమ కేసులకు భయపడేది లేదు: జోగి రమేశ్

image

అక్రమ కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తనపై అక్రమ కేసు పెట్టిందన్నారు. తాను నేరం చేయలేదని రుజువు చేయడానికి సిద్ధమన్నారు. దీనికి కూటమి ప్రభుత్వం సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. జైల్లో పెట్టి తనకు ఇంకా బలం చేకూర్చారని అన్నారు.