News December 11, 2025
MGUకి 500 కోట్లు మంజూరు చేయాలని విద్యార్థుల డిమాండ్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్లు మంజూరు చేయాలని గురువారం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ప్రకటించిన 1000 కోట్లు స్వాగతించదగ్గదేనిగానీ, ఎంజియు 20 ఏళ్లుగా పీజీ సెంటర్ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుర్దశ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల భారీ ఫీజులు, పరిశోధనలో వెనుకబాటు సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
Similar News
News January 19, 2026
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ చంద్రశేఖర్

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ‘ప్రజావాణి’లో ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. నూతన సర్పంచ్లు శిక్షణను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News January 19, 2026
ఇందిరమ్మ ఇళ్లపై నల్గొండ కలెక్టర్కు ఫిర్యాదు

మొల్కపట్నంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భారీగా అవకతవకలు జరిగాయని గ్రామస్థులు సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. మొదట అధికారులు సర్వే చేసి తాము అర్హులమని చెప్పారని, తీరా ఇళ్లు నిర్మించుకునే సమయానికి అనర్హులంటూ జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించారని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు.
News January 19, 2026
నల్గొండ: ఖతార్లో భారీగా ఉద్యోగాలు

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు TOMCOM మంచి అవకాశం కల్పిస్తోంది. ఖతార్లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, సివిల్ ఇంజినీర్, HSE ఆఫీసర్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.పద్మ తెలిపారు. 25-35 ఏళ్ల వయస్సు ఉండి, సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర వసతులు ఉంటాయని చెప్పారు.


