News November 20, 2025
MHBD: ఆశ్రమ పాఠశాలల సమస్యలపై ఈనెల 24న నిరసన

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం NOV 24న MHBDలో TPTF నిరసన ప్రదర్శన నిర్వహించనుంది. రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, గిరిజన విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, PRC అమలు, వేతనాల సకాలంలో చెల్లింపు వంటి డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Similar News
News January 20, 2026
నల్గొండ: M. Ed విద్యార్థులకు అలర్ట్

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed semester-3 (R-23) రెగ్యులర్కు సంబంధించిన పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి-10 నుంచి ఫిబ్రవరి-23 మధ్య జరుగుతాయి అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని కోరారు.
News January 20, 2026
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీ సునీల్ షొరాణ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ఎక్సైజ్, సెబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
News January 20, 2026
‘ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వేకు సిద్ధం కావాలి’

రాష్ట్రంలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లను కేటాయించి, రెండో గెజిట్ నోటిఫికేషన్ తర్వాత శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని సూచించారు. భూభారతి కింద చేపట్టే ఈసర్వేకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.


