News March 7, 2025

MHBD: పోలీస్ స్టేషన్‌లో దావత్.. ఇద్దరి సస్పెండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.

Similar News

News December 14, 2025

CM చంద్రబాబుపై MLA చంద్రశేఖర్ సెటైర్లు

image

CM చంద్రబాబుపై YCP MLA చంద్రశేఖర్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘వరుస ఓటములతో ఇక ఫుట్‌బాల్ ఆడనన్నాడు. నేను దావోస్ వెళ్లినప్పుడు అర్జెంటీనా నుంచి వచ్చి కలిశాడు. ఆటలో చిట్కాలు చెప్పా. ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు మెస్సీ. HYD వస్తారా, నన్నే అమరావతి రమ్మంటారా అని ఫోన్లు. వీలైతే ఈసారి విశాఖలో లోకేశ్ టీమ్, నీ టీమ్‌కూ మ్యాచ్ పెడదామన్నాను, ఆనందపడ్డాడు. మీకు ఎవరైనా గుర్తొస్తే నాకు సంబంధం లేదు!’ అని ట్వీట్ చేశారు.

News December 14, 2025

మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికలు: కలెక్టర్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 2వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు.

News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.