News August 23, 2025

MHBD: రైతులు ఎవరు కుడా ఆందోళన చెందవద్దు: DAO

image

జిల్లా రైతులకు ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో 21,042 మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేసినట్లు DAO విజయనిర్మల తెలిపారు. యూరియా సప్లై రెగ్యులర్‌గా వస్తుంది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. గతంతో పోలిస్తే 200మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చిందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవొద్దన్నారు.

Similar News

News January 23, 2026

మల్యాల: తండ్రిపై బండ రాయితో కొడుకు దాడి

image

మల్యాల కేంద్రానికి చెందిన పెరుమండ్ల సత్యనారాయణ (54)పై కొడుకు మనోజ్ బండరాయితో దాడికి పాల్పడ్డాడు. సత్యనారాయణకు ఇద్దరు భార్యలు కాగా, పెద్ద భార్య రుద్రంగిలో పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే శుక్రవారం తండ్రి దగ్గరకు వచ్చిన మనోజ్ మద్యం మత్తులో బండరాయితో తలపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న సత్యనారాయణను స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

News January 23, 2026

బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

image

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని బీపీ ప్ర‌భావితం చేస్తుంది. అయితే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల హైబీపీని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, అరటి పళ్లు, ఓట్స్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, సాల్మ‌న్, మాకేరెల్ చేపలను తీసుకోవాలి. అలాగే సాసేజ్, ప్రాసెస్ చేసిన మాంసం, సోడాలు, శీత‌ల పానీయాలు, ఎన‌ర్జీ డ్రింక్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బ‌ర్గ‌ర్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 23, 2026

ఏలూరులో గోదావరి పుష్కరాలపై కలెక్టర్ కీలక సమీక్ష

image

రామన్న గోదావరి పుష్కరాల్లో ఏలూరు జిల్లాలో సుమారు 50 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయన్నారు.