News April 28, 2024
క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి అండగా మంత్రి

TG: అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి వేదవల్లికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండగా నిలిచారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీనగర్కు చెందిన వేదవల్లి వైద్యానికి ఇప్పటికే రూ.40 లక్షలు ఖర్చవగా.. మరో రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
Similar News
News April 16, 2026
రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It
News April 16, 2026
రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It
News April 16, 2026
సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ ఫొటోలను మాజీ మంత్రి పరిటాల సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఉన్నారు. కాగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా నేతలు అక్కడికి వెళ్లారు.


