News October 7, 2024
మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేల దందా.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి?

AP: మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దరఖాస్తులు వేయొద్దని, తమకు వాటాలు ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 3,396 దుకాణాలకు లక్ష దరఖాస్తులు, రుసుముల రూపంలో రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికి 8,274 మాత్రమే వచ్చాయి. 961 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ గడువు 3 రోజుల్లో ముగియనుంది.
Similar News
News December 5, 2025
గూడూరు ప్రజల సెంటిమెంట్ పట్టించుకోరా..?

దుగ్గరాజపట్నం పోర్టు కోసమే గూడూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరులో గూడూరు విలీనం లేదా గూడూరు జిల్లా అనేది దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. ఇక్కడి మాట తీరు, కల్చర్ అంతా నెల్లూరుకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు మాది నెల్లూరేనని కొత్తవాళ్లతో పరిచయం చేసుకుంటారు. ఇంతలా అక్కడి వాళ్లు నెల్లూరుతో బంధం పెంచుకున్నారు.
News December 5, 2025
ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.
News December 5, 2025
ఇవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయ్..

మన ఆహార వ్యవస్థలకు పునాది భూమి. అయితే ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, రసాయన పరిశ్రమల వ్యర్థాలు, మిరిమీరిన పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగం, లోతు దుక్కులు, తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల, వరదలు, గాలి, తుఫానులతో నేల కోతకు గురవ్వడం వల్ల భూసారం దెబ్బతిని, పంట దిగుబడి, ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటి కట్టడికి మన వంతు ప్రయత్నం చేసి నేల సారం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.


