News September 12, 2025

MNCL: ‘కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

image

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసి ఆధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేఏసి నాయకులు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

Similar News

News December 8, 2025

కడప జిల్లాలో e-Shramలో నమోదు చేసుకున్న 3.80 లక్షల మంది

image

కడప జిల్లాకు చెందిన 3.80 లక్షల మంది శ్రామికులు తమ పేర్లను కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన e-Shram పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. 42.76% పురుషులు, 57.23% మహిళలు నమోదు చేసుకున్నారు. 18-40 వయస్సు వారు 45.2%, 40-50 వయస్సు వారు 30.27%, 50+ వయస్సు వారు 24.47% మంది చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, వ్యవసాయ, ఇతర రంగాల్లోని కార్మికులు ప్రభుత్వ పథకాల కోసం నమోదు చేసుకున్నారు.

News December 8, 2025

చైనా మోడల్‌లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్

image

TG: ‘తెలంగాణ రైజింగ్’ నిరంతర ప్రక్రియ అని, అందరి సహకారంతో లక్ష్యాలన్నిటినీ సాధించగలమన్న నమ్మకం ఉందని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ మోడల్‌లో TGని అభివృద్ధి చేస్తామని సమ్మిట్‌లో చెప్పారు. చైనా సహా జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా నుంచి ప్రేరణ పొందామని, వాటితో పోటీపడతామని వివరించారు. విజన్ కష్టంగా ఉన్నా సాధించే విషయంలో నిన్నటికంటే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.

News December 8, 2025

ములుగు: హీటెక్కిన “పంచాయితీ” సమరం

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న ఏటూరు నాగారం, తాడువాయి, గోవిందరావుపేట మండలాల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. మంత్రి సీతక్క సైతం ప్రచారంలో పాల్గొనడం, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో వాతావరణం హీటెక్కింది.