News November 20, 2025
MNCL: జాతీయ స్థాయి కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి ఛైర్మన్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ, ఉత్పత్తి చేయడం కోసం నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ బలరామ్ సభ్యులుగా నియమితులయ్యారు. దేశ కీలక ఖనిజ ప్రణాళికల వేగవంతం, స్వదేశీ వనరుల అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో సింగరేణి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నియామకం సంస్థ ప్రతిష్టను మరింత పెంచనుంది.
Similar News
News January 19, 2026
ఎమ్మిగనూరు: విషాదం.. తల్లీకూతురి మృతి

తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా ముసాపేట(M) జానంపేట సమీపంలోని NH-44పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన తల్లీకూతురు రాధ (42), లక్ష్మీదుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఆటో, బొలెరో వాహనాలు ఢీకొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News January 19, 2026
VKB: ధారాళంగా కారుతున్న వేపకల్లు.. ఎక్కడో తెలుసా!

ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు కారడం సహజంగా చూస్తూ ఉంటాం.. కానీ వేప చెట్టుకు దారాళంగా రోజుకు మూడు లీటర్ల వరకు కల్లు కారుతున్న అద్భుత దృశ్యం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామంలోని చావిడి దగ్గర కనిపించింది. వేప కల్లు చేదు స్వభావాన్ని కలిగి ఉన్న సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని గ్రామస్థులు తెలిపారు.
News January 19, 2026
మెదక్: 346 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు!

మెదక్ పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని 346 సంఘాలకు రూ. 90.24 లక్షల చెక్కులతో పాటు చీరలను అందజేశారు. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రుణాలను చిన్న వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.


