News April 22, 2024
దేశ సమస్యలపై మోదీ మాట్లాడట్లేదు: శరద్ పవార్

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కేవలం కాంగ్రెస్పై విమర్శలకే పరిమితమవుతున్నారని, దేశ సమస్యలపై మాట్లాడటం లేదని NCP-SP చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. గతంలో ప్రధానులు దేశ భవిష్యత్తుపై తమ విజన్ గురించి చెప్పేవారని గుర్తు చేశారు. మోదీ మాత్రం ప్రజల్ని ప్రభావితం చేసేందుకు విపక్షాలపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని విమర్శించారు. దేశ సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని ఆయన పట్టించుకోవట్లేదన్నారు.
Similar News
News December 10, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్

⋆ డైరెక్టర్ సుకుమార్ హానెస్ట్, ట్రాన్స్పరెంట్గా ఉంటారని హీరోయిన్ కృతిసనన్ ప్రశంసలు
⋆ ‘అఖండ-2’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో తమ ‘మోగ్లీ’ సినిమా విడుదలను DEC 12 నుంచి 13కి వాయిదా వేసినట్లు ప్రకటించిన డైరెక్టర్ సందీప్ రాజ్
⋆ ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపుపై మరో GO జారీ చేసిన AP ప్రభుత్వం.. 11న ప్రీమియర్ల టికెట్ ధర ₹600, 12వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్లలో ₹75, మల్టీప్లెక్స్లలో ₹100 చొప్పున పెంపు
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


