News April 15, 2025
ముస్లింలపై మోదీ వ్యాఖ్యలు.. ఒవైసీ కౌంటర్

హరియాణాలో నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ Xలో విమర్శలు గుప్పించారు. ‘వక్ఫ్ పేరిట దేశంలో లక్షల ఎకరాల భూములున్నాయి. వాటిని సక్రమంగా వినియోగించి ఉంటే ముస్లిం పిల్లలు సైకిల్ పంక్చర్ పనులు చేసుకోవాల్సి వచ్చేది కాదు’ అని మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ ‘సంఘ్ పరివార్ ఆస్తులు దేశం కోసం వినియోగించి ఉంటే మోదీ టీ అమ్మాల్సి వచ్చేది కాదు’ అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News April 18, 2025
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ REVIEW

సొంతంగా అన్యాయాలను ఎదిరించే కుమారుడు, చట్టప్రకారం వెళ్లే తల్లి మధ్య జరిగే సంఘర్షణే ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ స్టోరీ. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్షన్ సీన్స్, శ్రీకాంత్ నటన ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, ఊహకందని క్లైమాక్స్ మూవీకి ప్లస్. అయితే రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ముందే ఊహించే సీన్లు మైనస్. పాటలు ఆకట్టుకునేలా లేవు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ పాత్రకు ప్రాధాన్యత లేదు.
RATING: 2.5/5
News April 18, 2025
మే నుంచి ‘రామాయణ’ పార్ట్-2 షూటింగ్?

రణ్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా పార్ట్-1 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పార్ట్-2 షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్లో అశోక వాటిక సీన్లు, రెండు పాటలతో పాటు పలు కీలక సీన్లు చిత్రీకరిస్తారని సమాచారం. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.
News April 18, 2025
సమ్మర్లో తలనొప్పి రావొద్దంటే..

☞ తరచుగా తాగునీటిని తీసుకోవాలి. దాహం వేయకపోయినా తాగడం మంచిది
☞ బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్, టోపీ ధరించాలి
☞ 11am-4pm మధ్య నీడపట్టున ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్లాలి
☞ పుచ్చకాయ, నారింజ, దోసకాయ వంటి నీటిశాతం ఎక్కువ ఉండే వాటిని ఆహారంగా తీసుకోవాలి
☞ స్క్రీన్ టైమ్ తగ్గించాలి
☞ సమయానికి భోజనం చేయాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా తలనొప్పికి దారితీస్తుంది
☞ 5-10min మెడిటేషన్ చేయాలి