News May 1, 2024

ఈనెల 8,10న రాష్ట్రంలో మోదీ సభలు

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 8న వేములవాడ, వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. 10న మహబూబ్‌నగర్, HYDలోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభల్లో మోదీ ప్రసంగిస్తారు. అందుకు రాష్ట్ర బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

Similar News

News December 12, 2025

ప్రతి ఇంట్లో గంగా జలం ఎందుకు ఉండాలి?

image

ప్రతి ఇంట్లో గంగా జలం తప్పనిసరిగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల సానుకూల శక్తితో గృహంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అంటున్నారు. ‘గంగాజలం ఎప్పటికీ పాడవదు. ఎన్నేళ్లైనా గంగాజలాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. పూజలు, శుభకార్యాల సమయంలో ఉపయోగించవచ్చు. ఇల్లు కడిగేటప్పుడు, ఇంటికి సున్నం వేసే నీటిలో కొద్ది గంగా జలం వినియోగిస్తే.. ఏ ప్రతికూల శక్తి ప్రవేశించదు’ అని అంటున్నారు.

News December 12, 2025

చిలగడదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

image

శీతాకాలంలో దొరికే చిలగడదుంపలు పోషకాల పవర్ హౌస్ అని వైద్యులు చెబుతున్నారు. ‘వీటిలోని బీటా కెరోటిన్ కంటి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెద్దమొత్తంలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. అలాగే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తాయి’ అని అంటున్నారు.

News December 12, 2025

చివరి దశకు ‘పెద్ది’ షూటింగ్

image

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి HYDతో కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వచ్చే నెల చివరికల్లా టాకీ పార్ట్ పూర్తవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ నుంచి రిలీజైన చికిరీ సాంగ్ ఇప్పటికే వ్యూస్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్ కానుంది.