News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా UPDATES

image

భూపాలపల్లి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 578 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 3,03,000 మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News March 14, 2026

మెదక్ జిల్లాలో 99.83% హాజరు నమోదు: డీఈవో

image

మెదక్ జిల్లాలో పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు) పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిందని డీఈవో విజయ తెలిపారు. హవేలీఘన్పూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 11,239 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11,220 మంది హాజరై 19 మంది గైర్హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారిలో 14 మందికి 9 మంది పరీక్ష రాయగా హాజరు శాతం 99.83గా నమోదైందని పేర్కొన్నారు.

News March 14, 2026

CTR: వాటర్ బాటిల్ ధరల పెంపు ఇందుకే.!

image

ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే ‘పాలిమర్’ వాటర్ బాటిల్ తయారీకి కీలకం. యుద్ధ నేపథ్యంలో చమురు రేట్లు పెరగటంతో పాలిమర్ రేట్లు సైతం 50% మేర పెరిగాయి. ఇక వాటర్ బాటిల్ క్యాప్ ధర కూడా దాదాపు రూ.0.50 పైసలకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో పాలిమర్ KG ధర రూ.160-180 మధ్య ఉంది. ఇంతకు ముందు ఇది రూ.10లోపే ఉండేదని వ్యాపారులు అంటున్నారు. దీంతో దుకాణాల్లో <<19382920>>వాటర్ బాటిల్స్<<>> ధరలు పెరుగనున్నట్లు తెలుస్తోంది.

News March 14, 2026

IPL.. ధోనీ స్థానంలో సంజూ కీపింగ్ చేయాలి: రైనా

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో CSKకు ధోనీ స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. అలాగే ఓపెనర్‌గా కాకుండా ఆయనను మూడో స్థానంలో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ‘ఓపెనర్లుగా రుతురాజ్, ఆయుష్ మాత్రేను పంపించాలి. 4 ,5 స్థానాల్లో బ్రెవిస్, శివమ్ దూబే, ఆరో ప్లేస్‌లో ప్రశాంత్/అకేల్ హోసేన్/నూర్ అహ్మద్‌లలో ఎవరిని తీసుకుంటారో వేచిచూడాలి’ అని పేర్కొన్నారు.