News August 6, 2024
జిల్లా ఆస్పత్రుల్లో త్వరలో MRI, సీటీ స్కాన్ సేవలు: ప్రభుత్వం

TG: HYDలోని ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో అందించే వైద్య సేవలను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు సీనియర్ డాక్టర్లను జిల్లా ఆస్పత్రులకు బదిలీ చేసింది. అన్ని ఆస్పత్రుల్లో MRI, సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మెషీన్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది. సిటీలోని ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని తెలిపింది.
Similar News
News December 9, 2025
పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
News December 9, 2025
మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్: గల్లా జయదేవ్

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
News December 9, 2025
చైనాకు వెళ్తుంటే జాగ్రత్త!

భారతీయులు చైనాకు వెళ్తున్నా, ఆ దేశం మీదుగా ప్రయాణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ఇటీవల షాంఘై ఎయిర్పోర్టులో AR.P మహిళను <<18509379>>నిర్బంధించిన<<>> నేపథ్యంలో హెచ్చరించింది. భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. నిర్బంధించడం మానుకొని విమాన ప్రయాణ నిబంధనలు గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.


