News April 20, 2024
మస్క్ భారత పర్యటన వాయిదా

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా X వేదికగా తెలియజేశారు. టెస్లాకు సంబంధించిన ముఖ్యమైన పనులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలోనే భారత్లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ఆసక్తి కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది.
Similar News
News December 10, 2025
SKY..WHY?

IND టీ20 కెప్టెన్ సూర్య గత కొంతకాలంగా బ్యాటుతో రాణించలేకపోతున్నారు. ఒక్క ఫార్మాట్కే పరిమితమైన ఈ హిట్టర్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి. గత 19 ఇన్నింగ్స్లలో 13.47Avg, 119.35 స్ట్రైక్ రేటుతో 222 రన్స్ చేశారు. ఇందులో 11 ఇన్నింగ్స్లలో ఆయన స్కోర్ 10లోపే ఉంది. నిన్న SAతో తొలి T20లో 12 రన్స్ చేశారు. కెప్టెన్సీ వల్లే SKY బ్యాటింగ్లో ఫెయిలవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News December 10, 2025
ఇంటి చిట్కాలు

* ఫర్నిచర్కు చెదలు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో తీసుకుని కలిపి, ఈ మిశ్రమంతో ఫర్నిచర్ తుడవాలి.
* బొద్దింకలు ఉన్న ప్రదేశాల్లో కీరదోసను ముక్కలుగా కోసి ఉంచితే బొద్దింకలు మళ్లీ కనిపించవు.
* ఓవెన్లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు తగ్గుతాయి.
* డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే ఈగలు తగ్గుతాయి.
News December 10, 2025
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రంలో కోడిపుంజు ఎందుకు?

కార్తికేయుడి వాహనం నెమలి అని అందరికీ తెలుసు. అయితే ఆయన చిత్రాల్లో ఆ పక్షితో పాటు కోడిపుంజు కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడిని సంహరించేటప్పుడు ఆ రాక్షసుడు చెట్టు రూపంలో మారాడు. కార్తికేయుడు తన ఆయుధంతో ఆ చెట్టును చీల్చగా ఓ భాగం నెమలి, మరో భాగం కోడిపుంజుగా మారాయి. నెమలిని ఆయన తన వాహనంగా చేసుకున్నాడు. కోడిపుంజుని ధ్వజంగా స్వీకరించాడు. అలా కార్తికేయునికి కోడిపుంజుతో అనుబంధం ఏర్పడింది.


