News April 14, 2024

దేశ అభివృద్ధే మా లక్ష్యం: జేపీ నడ్డా

image

ప్రధాన పరిపాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ కోసం ప్రధాని మోదీ సమయాన్ని కేటాయిస్తారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. దేశ అభివృద్ధే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. అంబేడ్కర్ బాటలోనే తాము పయనిస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తామన్నారు.

Similar News

News December 11, 2025

మన ఊహకందనంత శక్తిమంతుడు ‘విష్ణుమూర్తి’

image

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||
లోకాలన్నింటిలో అతి గొప్పవాడు, ధర్మానికి న్యాయ నిర్ణేత విష్ణు. జరిగిపోయింది, జరగాల్సిందంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. నాలుగు రూపాలుగా, నాలుగు పద్ధతుల్లో, నాలుగు భుజాలతో కనిపించే ఆయన మన ఊహకందనంత శక్తిమంతుడు. ఆ దైవాన్ని మనం మనసులో పెట్టుకొని భక్తితో ధ్యానిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 11, 2025

ఇంత గందరగోళానికి ఇండిగోనే కారణం: రామ్మోహన్

image

ఇండిగో విమాన సేవలు తిరిగి గాడిలో పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తలెత్తిన సంక్షోభానికి ఆ సంస్థ ‘మిస్ మేనేజ్మెంట్’ మాత్రమే కారణమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘వారి అంతర్గత సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థలో కొంత గందరగోళం నెలకొంది. FDTL మార్గదర్శకాల ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా దానిని నివారించి ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు’ అని తెలిపారు.

News December 11, 2025

‘అఖండ-2’ విడుదల: దెబ్బ మీద దెబ్బ

image

‘అఖండ-2’ సినిమాకు వరుస అడ్డంకులు ఎదురవుతుండటం నిర్మాతలు, ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. డిస్ట్రిబ్యూటర్ ఆర్థిక లావాదేవీల <<18474420>>సమస్యతో<<>> ఈ నెల 5న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా ప్రీమియర్ షో టికెట్ల ధర పెంపు జీవోను TG హైకోర్టు సస్పెండ్ చేయడంతో అదనపు ఆదాయం పొందాలనుకున్న నిర్మాత ఆశలు అడుగంటాయి. కాగా ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రిఫండ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.