News November 19, 2025
NGKL: మంత్రాలయానికి బస్సు.. ఫోన్ చేయండి!

కార్తీక బహుళ అమావాస్య పురస్కరించుకుని NGKL డిపో నుంచి డిలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 20న NGKL నుంచి మధ్యాహ్నం బయలుదేరి, మంత్రాలయం(రాఘవేంద్ర స్వామి), పంచముఖి ఆలయం దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయంలో బస ఉదయం పంచముఖి నుంచి బయలుదేరి జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి ప్రయాణం అన్నారు. ఛార్జీ రూ.1000. వివరాలకు 94904 11591, 94904 11590కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News January 20, 2026
రోడ్డు భద్రతపై నేడు అవగాహన సదస్సు

రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు సాగే ఈ సదస్సులో జిల్లా కలెక్టర్తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
News January 20, 2026
రాసలీలల వీడియో వైరల్.. కర్ణాటక DGPపై సస్పెన్షన్ వేటు

కర్ణాటక సీనియర్ IPS, <<18898562>>DGP<<>> ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తన ఆఫీసులోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణ ఉల్లంఘన కింద సర్వీస్ నుంచి తొలగిస్తూ విచారణకు ఆదేశించింది. అయితే ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవని రామచంద్రరావు వాదిస్తున్నారు.
News January 20, 2026
ప.గో: తల్లి చేసిన తప్పు.. పిల్లాడి ప్రాణం తీసిన కూల్ డ్రింక్!

భీమవరంలో తల్లి చేసిన తప్పు ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. భర్తపై అలిగిన లక్ష్మి అనే మహిళ కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకుని కొంచెం తాగి నిద్రపోయింది. లక్ష్మి కుమారుడు మహా రుద్ర కాంత్ మిగిలిన కూల్ డ్రింక్ తాగేశాడు. అస్వస్థతకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


