News December 1, 2025
NGKL: రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన కబడ్డీ జట్టు

నల్గొండ జిల్లాలోని హాలియాలో జరుగుతున్న 51వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ ఛాంపియన్ షిప్లో నాగర్కర్నూల్ జిల్లా బాలికల కబడ్డీ జట్టు పాల్గొనేందుకు బయలుదేరిందని కబడ్డీ సంఘం అధ్యక్షుడు ఎం.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి A.యాదయ్య గౌడ్ ‘Way2News’తో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకు పేరు తీసుకురావాలని, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు.
Similar News
News February 19, 2026
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 83,762 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 25,831 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో HCL, టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫీ షేర్లు లాభాల్లో.. ఇండిగో, KWIL, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
News February 19, 2026
మహా శివరాత్రి.. కడప జిల్లా ఆర్టీసీకి ఆదాయం ఎంతంటే..!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప రీజియన్ ఏడు డిపోల నుంచి వివిధ శైవ క్షేత్రాలకు 1317 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఆర్టీసీ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపు 1,46,077 KM నడిపినట్లు చెప్పారు. దీంతో రూ.1.11 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆదరించి ఆదాయం రావడానికి తోడ్పడిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
News February 19, 2026
‘వారణాసి’ నాకు కెరీర్ డిఫైనింగ్ సినిమా: ప్రియాంకా చోప్రా

‘వారణాసి’ తనకు కెరీర్ డిఫైనింగ్ సినిమా అవుతుందని హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ‘రాజమౌళికి ఉన్న విజన్ ఎవరికీ లేదు. ఆయనతో వర్క్ చేయడం ఎగ్జైటింగ్గా ఉంది. నా కెరీర్పై ఈ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది చాలా భిన్నం’ అని ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2027 APR7న రిలీజ్ కానుంది.


