News October 6, 2025
NLG: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ ఇదే..

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీకాం మూడు, ఐదో సెమిస్టర్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులను అక్టోబర్ 14 లోపు ఫైన్ లేకుండా చెల్లించాలని ఎంజీయూ సీఈవో ఉపేందర్ రెడ్డి తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో అక్టోబర్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 15, 2026
HYDలో 3 రోజులు.. సాయంత్రం అలా!

పరేడ్ గ్రౌండ్లో కైట్& స్వీట్ ఫెస్టివల్ నేడు ఆఖరిరోజు. నిరాశ చెందకండి రేపటి నుంచి అసలు మజా ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ షోతో ఉంటుంది. చల్లని సాయంత్రం, చిన్న ఫైర్తో రంగుల బెలూన్లు ఆకాశంలో ఎగురుతుంటే ఫ్యామిలీ, దోస్తులతో వాటిని చూస్తూ చిల్ అవ్వడం కంటే ఏంకావాలి. ఆకాశంలో ఎగిరే ఈ బెలూన్లు నగరవాసులతో సహా పొరుగు రాష్ట్రాల వారికి మరపురాని అనుభూతిని అందించనున్నాయి. నేడు కైట్ ఫెస్టివల్కు భారీగా తరలిరానున్నారు.
News January 15, 2026
173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 15, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం.. తల్లీకుమారుడి మృతి

ఉదయగిరి(M)లో నిన్న <<18859378>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. దాసరపల్లికి చెందిన సయ్యద్ సాహెర(36) భర్త ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ ఉదయగిరిలో ఉంటున్నారు. కుమారుడు మజహర్(19)తో కలిసి సాహెర దాసరిపల్లికి వెళ్లింది. తిరిగి బైకుపై ఉదయగిరికి వస్తుండగా దుత్తలూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. సాహెర స్పాట్లోనే చనిపోయింది. మజహర్ను వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్తుండగా మధ్యలో కన్నుమూశాడు.


