News May 23, 2024
NLG: నేడు సాగర్లో బుద్ధ జయంతి

నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో బుద్ధ జయంతి ఉత్సవాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలు నిర్వహించడానికి పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో బౌద్ధ బిక్షవులతో బుద్ధ పాదుకల వద్ద ప్రత్యేక పూజలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు బుద్ధవనంలోకి ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 9, 2026
నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 9, 2026
వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.
News March 9, 2026
నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


