News August 12, 2025
NLG: పాత పద్ధతిలోనే ‘ పది’ పరీక్షలు!

పదో తరగతి వార్షిక పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాదిరిగానే రాత పరీక్ష 80 మార్కులు, ఇంటర్నల్ మార్కులు 20 చొప్పున ఉంటాయి. ఈ విధానం 2014-15 నుంచి అమల్లో ఉంది. కాగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని 100 మార్కులతోనే వార్షిక పరీక్షలు ఉంటాయని గతేడాది అక్టోబర్ 28న ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News March 15, 2026
NLG: పల్లెల్లో ఇక ‘సౌర’ వెలుగులు..

సామాన్యుడి ఇంటిపై ఇక సౌర ఫలకలు మెరవనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ’ పథకం ద్వారా గ్రామాల్లో ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిదశలో భాగంగా నల్గొండ జిల్లాలోని కనగల్, అనుముల, ముదిగొండ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లోని ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
News March 15, 2026
నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
News March 15, 2026
జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ బి.చంద్ర శేఖర్

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య గ్యాస్ నిల్వలు తగ్గినప్పటికీ, జిల్లాలో గృహ అవసరాల (Domestic) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ బి.చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


