News August 14, 2025

NLG: బాలికపై హత్యాచారం.. వివరాలు ఇవే

image

2013లో నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో <<17400954>>ముక్రమ్ <<>>అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా బాలికను రేప్ చేశాడు. అనంతరం బాలికను హత్య చేసి నాలాలో పడేశాడు. తొలుత మిస్సింగ్ కేసు నమోదైనప్పటికీ బాలిక మృతదేహం నాలాలో దొరకడంతో హత్య కేసుగా నమోదైంది. ముక్రమ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు గుర్తించారు. సాక్ష్యాలను సేకరించి కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి నేడు తీర్పు చెప్పారు.

Similar News

News March 13, 2026

NLG: 62 పోస్టులు.. 16న ఇంటర్వ్యూలు

image

ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కోసం ఈనెల 16న ప్రిన్సిపల్ ఛాంబర్‌లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్స్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 14 మంది ట్యూటర్స్‌ను తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకోనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.

News March 13, 2026

పరీక్షల్లో అప్రమత్తత అవసరం: డీఈఓ లలిత

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈఓ లలిత తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్, OMR షీట్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాతే సమాధానాలు రాయాలని, ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.