News November 12, 2025

NLG: రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

image

MGU పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,827 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. డిగ్రీ సెమిస్టర్ 1,3,5 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబరు ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 12, 2025

రంగారెడ్డి: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 13న ఇంటర్వ్యూ

image

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్లు తీసుకురావాలన్నారు.

News November 12, 2025

రంగారెడ్డి: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 13న ఇంటర్వ్యూ

image

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్లు తీసుకురావాలన్నారు.

News November 12, 2025

HYD: శ్రీధర్‌రావు ఆక్రమణలను తప్పుబట్టిన హైకోర్టు

image

గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. అందుకే హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది.