News March 28, 2024
పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు: జైశంకర్

సమస్యలకు పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. కౌలాలంపూర్ పర్యటనలో ఉన్న ఆయన, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ‘ఈ యుద్ధానికి ఎలాగైనా ముగింపు తీసుకురావాలనే భారత్ భావిస్తోంది. రణంలో విజేతలు ఉండరు. ముగిసేసరికి అమాయకులు కూడా నష్టపోతారు. ఎలాగోలా ఈ యుద్ధాన్ని ఆపాలి. గాజా ఉద్రిక్తతలకూ ఇదే వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
లవర్స్ డే: పూల కంటే వాటినే ఎక్కువ కొన్నారు

లవ్ అంటే రోజా పువ్వు అనే ఆలోచన క్రమంగా మారుతోంది. ఈ వాలంటైన్స్ డేకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో గులాబీలు, గిఫ్ట్స్ కంటే కండోమ్స్, శృంగార అనుబంధ ప్రొడక్టులే అధికంగా కొన్నారు. క్విక్ కామర్స్ రిపోర్ట్ ప్రకారం బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ ఇందులో టాప్లో ఉన్నాయి. చాక్లెట్స్-2, టెడ్డీస్-3లో ఉండగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, HYD, చెన్నైలో ఈ ఆర్డర్లు ఎక్కువొచ్చాయి. కోల్కతాలో ఓవ్యక్తి ₹25K చాక్లెట్స్ కొన్నాడు.
News February 18, 2026
భారత వ్యతిరేక శక్తులతో రాహుల్కు సంబంధాలు: రిజిజు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో ఆయనకు సంబంధాలున్నాయన్నారు. దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. నక్సలైట్లు, తీవ్రవాదులను రాహుల్ కలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు జార్జ్ సొరోస్ వంటి నేతలను కలుస్తున్నారని ANIతో చెప్పారు.
News February 18, 2026
ఇంటర్వ్యూతో హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

HYDలోని <


