News July 6, 2024

వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు నోటీసులు ఇవ్వండి: పవన్ కళ్యాణ్

image

AP: కాకినాడకు చెందిన YCP నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంట కాలువల్లోకి ఆ సంస్థ శుద్ధి చేయని వ్యర్థాలను విడుదల చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో పాటు పర్యావరణ ఉల్లంఘనలపైనా సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా సంస్థకు నోటీసులు ఇవ్వాలని పవన్ సూచించారు.

Similar News

News December 11, 2025

కర్నూలు: ‘ఈనెల 21న జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి’

image

డిసెంబర్ 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు 3,52,164 మంది పిల్లలకు వందశాతం టీకా వేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన మెడికల్ ఆఫీసర్ల సెన్సిటైజేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్సీలు, యుపిహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. బయటికి మందులు పంపకూడదు, డెలివరీ తర్వాత డబ్బులు వసూలు చేయకూడదు అని స్పష్టం చేశారు.

News December 11, 2025

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

*పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం
*సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్
*AP ప్రిజన్స్&కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే
*రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
*SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
*కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం

News December 11, 2025

18న గవర్నర్‌తో జగన్ భేటీ

image

AP: గవర్నర్‌‌తో YCP చీఫ్ YS జగన్ భేటీ తేదీ ఖరారైంది. ఈనెల 18న ఆయన గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను సమర్పిస్తారు. కాగా జగన్‌కు ఈనెల 17న గవర్నర్ అపాయింట్మెంటు ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో దాన్ని 18కి వాయిదా వేసినట్లు తాజాగా లోక్‌భవన్ కార్యదర్శి లేఖ పంపారు. కాగా కోటి సంతకాల పత్రాలను YCP నేతలు విజయవాడకు తరలిస్తున్నారు.