News March 16, 2025
NRML: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 18, 2026
ఎLAW: చిల్లుపై బిల్లుతో పోరాడవచ్చు

హోటళ్లలో ఫుడ్ తిన్నాక అస్వస్థతకు గురైతే ఆ మేనేజ్మెంట్ను తిట్టుకుని, డాక్టర్ను కలిసి మెడిసిన్ వేసుకుని సరిపెట్టుకుంటాం. కానీ మనకు జరిగిన శారీరక, ఆర్థిక, మానసిక నష్టానికి పరిహారం పొంది చట్టపర చర్యలతో మరోసారి, మరొకరికి ఇలా జరగకుండా చూడొచ్చు. దీనికి కావాల్సింది మీ ఫుడ్ బిల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీటితో ఫుడ్ సేఫ్టీ అథారిటీలో లేదా కోర్టులో కేసు వేయొచ్చు. కాబట్టి డబ్బు చెల్లించగానే బిల్ పడేయకండి.
News February 18, 2026
రాంబిల్లి: పేలిన అమ్మోనియా గ్యాస్ సిలిండర్.. ఉద్యోగి మృతి

రాంబిల్లి మండలంలో ఇన్నోవేర్ ల్యాబ్ పరిశ్రమలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కెమిస్ట్ బొద్ద అజయ్ కుమార్ (21) మృతి చెందాడు. అమోనియా గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలడంతో విషవాయువు వ్యాపించింది. విషవాయువును పీల్చిన అజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కెమిస్ట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
News February 18, 2026
KMR: కూరగాయల ధరలపై లుక్కెద్దాం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్కెట్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.. ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో చొప్పున టమాట రూ.15, గోరుచిక్కుడు 50, బెండకాయ 40, దోసకాయ 40, బీరకాయ 50, ఆలుగడ్డ 40, క్యారెట్ 40, బీట్ రూట్ 50, పచ్చిమిర్చి 50, పాలకూర 40, క్యాబేజీ 50, కాలీఫ్లవర్ 60, వంకాయ 50, దొండకాయ 50, చిక్కుడు కాయ 50, ఉల్లిగడ్డ 30, ఎల్లిగడ్డ 200, అల్లం 80, మూలగకాయ 60, మెంతి, కొత్తిమీర రూ.10 (ఒక కట్ట)


