News March 12, 2025
NRPT: తెలంగాణ బడ్జెట్.. జిల్లాకు ఏమి కావాలంటే.?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో NRPT జిల్లాకు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 69జీవోను పాత డీపీఆర్ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు, రోడ్ల మరమ్మత్తులకు నిధులు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు, వాగులపై చెక్ డ్యాముల నిర్మాణం, కొత్తగా బస్టాండ్ నిర్మించాలని కోరుతున్నారు.
Similar News
News February 19, 2026
వనపర్తి: ‘ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు, పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యాదయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు సూచనల ప్రకారం పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి అంజయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 19, 2026
తెలుగు రాష్ట్రాల తీరుపై CWC అసంతృప్తి

TG: జలవివాదాల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల వైఖరిపై CWC అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇవ్వాల్సిన అజెండాను AP, TG పంపకపోవడంతో JAN 30న జరిగిన భేటీ నిర్ణయాలు లేకుండానే ముగిసింది. తదుపరి భేటీకి 10 రోజుల్లో అజెండా పంపిస్తామని రెండూ అప్పట్లో చెప్పాయి. అయితే 20 రోజులైనా వాటి జాడలేదు. దీనిపై కమిషన్ సీరియస్ అయినట్లు సమాచారం. దీనిపై TG అధికారులు స్పందిస్తూ నెలాఖరుకు అందిస్తామని తెలిపారు.
News February 19, 2026
మదనపల్లె మృగాడికి మరణం తర్వాతా శిక్ష

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబం నిరాకరించింది. నిన్న పోస్టుమార్టం రిపోర్టుపై సంతకానికి సైతం రాకపోవడంతో అతడి పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు బాడీ కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేయనున్నారు. కాగా 7సం.ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ కులవర్ధన్, శిక్ష భయంతో చెరువులో దూకి చనిపోయాడు.


