News May 7, 2025
NRPT: ‘భూ భారతితో పెండింగ్ సమస్యలకు పరిష్కారం’

ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. రైతులు ఈ కొత్త చట్టంలోని సెక్షన్లపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. శుక్రవారం కోస్గి పట్టణంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ధరణిలో ఉన్న లోపాలను గుర్తించి రైతులకు మెరుగైన చట్టం తేవాలని ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చిందన్నారు.
Similar News
News February 17, 2026
TODAY HEADLINES

* AIపై చర్చకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం: PM
* టెక్నాలజీతో పౌర సేవకు బిల్గేట్సే ప్రేరణ: CBN
* చంద్రబాబువి విజనరీ ఆలోచనలు: బిల్ గేట్స్
* మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
* బడ్జెట్ సెషన్ రెండో దశలో అమరావతి బిల్లు?
* TG: కాంగ్రెస్ ఖాతాలోకి 82 ఛైర్మన్, 5 మేయర్ పోస్టులు
*TG: సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల
* JEE ఫలితాలు.. ముగ్గురు తెలుగువారికి 100 పర్సంటైల్
News February 17, 2026
HYD: ఆఫీసే నయం.. ఇంటికి వెళ్లాలంటేనే భయం!

‘బాస్ పిలుస్తాడని కాదు.. ఇంటికెళ్తే వచ్చే తలనొప్పి భరించలేక’ ఇదీ నేటి యూత్ మైండ్సెట్. ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ ఒక ఎత్తైతే, ఇంటికి వెళ్లాక ల్యాప్టాప్ వదలని ‘ఆల్వేస్ అవైలబుల్’ కల్చర్ యువతను నిలువునా దహించేస్తోంది. అందుకే ఇంటికెళ్లి ఆ గందరగోళంలో పడేకంటే, ఆఫీసులోనే కాసేపు ఎక్కువ గడిపి ఆ ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, మానసిక ప్రశాంతత కోసమే ఈ లేట్ నైట్ తిప్పలు!
News February 17, 2026
HYD: ఆఫీసే నయం.. ఇంటికి వెళ్లాలంటేనే భయం!

‘బాస్ పిలుస్తాడని కాదు.. ఇంటికెళ్తే వచ్చే తలనొప్పి భరించలేక’ ఇదీ నేటి యూత్ మైండ్సెట్. ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ ఒక ఎత్తైతే, ఇంటికి వెళ్లాక ల్యాప్టాప్ వదలని ‘ఆల్వేస్ అవైలబుల్’ కల్చర్ యువతను నిలువునా దహించేస్తోంది. అందుకే ఇంటికెళ్లి ఆ గందరగోళంలో పడేకంటే, ఆఫీసులోనే కాసేపు ఎక్కువ గడిపి ఆ ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, మానసిక ప్రశాంతత కోసమే ఈ లేట్ నైట్ తిప్పలు!


